
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో పొగమంచు దట్టంగా కురుస్తోంది. పొగమంచు కారణంగా ఎయిర్పోర్టు నుంచి విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమహేంద్రవరం విమాన సర్వీసులు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన 4 విమాన సర్వీసుల దారి మళ్లించారు. పొగమంచు కారణంగా విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో శంషాబాద్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ దగ్గర జాతీయ రహదారి, ఔటర్ రింగ్రోడ్డుపై కూడా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.