మీకు తెలుసా : ఆదివారం.. 5 గంటలు.. ఈ ఎయిర్ పోర్ట్ మూసివేత

మీకు తెలుసా : ఆదివారం.. 5 గంటలు.. ఈ ఎయిర్ పోర్ట్ మూసివేత

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ 21  ఆదివారం రోజున  సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అంటే ఐదు గంటల పాటు విమానాల రాకపోకలపై నిషేధం ఉంటుంది. ఈ విషయాన్ని తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (TIAL) బుధవారం  వెల్లడించింది. 

 శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి బయలుదేరే  పెంకుని ఆరట్టు  ఊరేగింపు ఎయిర్‌పోర్ట్ గుండా వెళుతుందని, ఈ సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఐదు గంటల పాటు విమాన సర్వీసును నిలిపివేయాలని నిర్ణయించినట్లు TIAL తెలిపింది. ఏడాదికి రెండు సార్లు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలా జరుగుతుంది.  

సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఆలయ దేవతల ఊరేగింపు  ఈ విమానాశ్రయం గుండా జరుగుతున్నాయి. ఊరేగింపులో భాగంగా  విమానాశ్రయం  వెనకాల ఉన్న సముద్రంలో  విగ్రహాల ఉత్సవ స్నానం తరువాత సాంప్రదాయ జ్యోతుల ద్వారా వెలిగించిన ఊరేగింపులో విగ్రహాలను తిరిగి మందిరానికి తీసుకువెళతారు.