పండగ సీజన్ వచ్చిందంటే చాలు ఈ కామర్స్ సైట్లు భారీ తగ్గింపులు, డిస్కౌంట్లతో ప్రత్యేక సేల్ను నిర్వహిస్తాయి. ఇప్పటికే దసరా పండగకు ప్రత్యేక తగ్గింపు సేల్స్ ను తెచ్చిన ఫ్లిప్కార్ట్ ... దీపావళి పండగకు 'బిగ్ దివాళి' సేల్ను ప్రకటించింది. ఈ సేల్ కొనసాగేది 10 రోజుల పాటు మాత్రమే . ఈ సేల్స్ ఇది నవంబర్ 2 నుంచి 11 వరకు ఉంటాయని ఫ్లిప్కార్ట్ యాజమాన్యం తెలిపింది. అయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం ఈ సేల్ ఒక రోజు ముందుగా అంటే నవంబర్ 1 నుంచి మొదలవుతుంది.
ఫ్లిప్కార్ట్ మరోసారి ఆఫర్లతో కూడిన సేల్ అందుబాటులోకి తెస్తుండటంతో దసరా సేల్లో మిస్సయినవారు ఇప్పుడు ఈ ఆఫర్లను వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్ దీపావళి సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్ అనేక రకాల ఆఫర్లు ప్రకటించింది. కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డ్లు, EMI ల కనీస లావాదేవీ రూ.5000 లపై 10 శాతం తక్షణ తగ్గింపు ఉంది. Paytm పై 10శాతం క్యాష్బ్యాక్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. యూపీఐ, వ్యాలెట్ లావాదేవీలపైనా తగ్గింపు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్స్ లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్టీవీలు, హెడ్ఫోన్స్, దుస్తులు, బ్యూటీకేర్ ఉత్పత్తులు, ఇంటికి అవసరమైన పలు రకాల వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయని ఫ్లిప్కార్ట్ తెలిపింది.
- ALSO READ | హర్మాన్ కార్డాన్ స్పీకర్లతో హాయర్ ఓఎల్ఈడీ టీవీ
ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చని ఆ సంస్థ పేర్కొంది. వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పాటు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లపై 45 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్వాచ్, దుస్తులపై అయితే ఏకంగా 80 శాతం వరకు ఆఫర్లు అందించనున్నట్టు సమాచారం. ఇక సూపర్ కాయిన్ల ద్వారా అదనపు డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. ఈ ఆఫర్లను వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ దీపావళికి ఆఫర్ల ధమాకా అందుకునేందుకు వినియోగదారులూ సిద్ధమైపోండి..