ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫ్లడ్​ రెస్క్యూ టీమ్​ డెమో

ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫ్లడ్​ రెస్క్యూ టీమ్​ డెమో

మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్​కమిషనర్ ఎం.శ్రీనివాస్​ ఆధ్వర్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో బుధవారం నిర్వహించిన ఫ్లడ్​రెస్క్యూ టీమ్ ​డెమో ఆకట్టుకుంది. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్, స్పెషల్ పార్టీ నుంచి 20 మంది కానిస్టేబుళ్లతో ఈ టీమ్​ను ఏర్పాటు చేశారు. 

వీరికి హైదరాబాద్ లోని ఎన్​డీఆర్​ఎఫ్​ ట్రైనింగ్​ సెంటర్​లో శిక్షణ ఇప్పించారు. ముందస్తు అప్రమత్తతలో భాగంగా ప్రమాదంలో ఉన్న వారిని ఎలా రక్షించాలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫ్లడ్ రెస్క్యూ టీమ్ ​డెమో నిర్వహించారు. కలెక్టర్ బి.సంతోష్, డీసీపీ అశోక్​కుమార్, గోదావరిఖని, మంచిర్యాల ఏసీపీలు రమేశ్, ప్రకాశ్, రూరల్​ సీఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.