
ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకొనేందుకు ,.. మారుతున్న టెక్నాలజీ ప్రకారంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ మరో అడుడు ముందుకేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీరిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. దీనికోసం పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవవనరులు, సదుపాయాలపై జులై 15 కల్లా వర్కింగ్ గ్రూపు నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. స్టూడెంట్స్ కు హైఎండ్ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సీఎం జగన్ తెలిపారు. జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువును అభ్యసిస్తున్నారు.
విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరంలో సీఎం జగన్ ప్రభుత్వం మరొ కీలక నిర్ణయం తీసుకుంది. బైలింగువల్ టెక్ట్స్బుక్స్ను రూపొందించి విద్యార్థులకు అందించింది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్, సోషల్ స్టడీస్, మాథమెటిక్స్ సబ్జెక్టుల్లో బై లింగువల్ టెక్ట్స్బుక్స్ను అందించింది. ఇంగ్లీషులో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ల్యాబ్స్ ఏర్పాటుచేసింది. అలాగే 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం చదువుతున్నారు.
2021-22 లో 6వ తరగతి నుంచి 10వ తరగతివరకూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని విద్యార్థులకు అందించింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ పిక్టోరియల్ డిక్షనరీని అందించింది. అంతేకాక 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. విద్యార్థులకు సైన్స్, సోషల్, మాథమెటిక్స్లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్తో ఒప్పందం చేసుకుంది. దీనికోసం ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు అందించింది. ఇందులో బైజూస్ కంటెంట్ యాప్ను లోడ్ చేశారు. అందులో పాఠ్యాంశాలు ఆడియో, వీడియో రూపంలో ఉండడంవల్ల పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతున్నారు.
ఏపీ ప్రభుత్వం- పాఠశాలల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపట్టింది. నాడు-నేడు పూర్తిచేసుకున్న 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ (ఐఎఫ్పీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం జులై కల్లా ఈ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక మరో 10,038 తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో ఈవచ్చే డిసెంబర్ నాటికి ఐఎఫ్పీలు, స్మార్ట్టీవీల ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్ పరీక్షలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం. ప్రపంచస్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిషులో పరిజ్ఞానం అన్నది చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీంతోపాటు భవిష్యత్తు టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులగా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), ఎల్ఎల్ఎం ఫ్లాట్ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్ ఛాట్ జీపీటీ, వెబ్ 3.O, అగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెంట్ర్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అటానమస్ వెహికల్స్, త్రీడీ ప్రింటింగ్, గేమింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను, మార్పులను సూచించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సెక్రటరీ మెంబర్గా ఉంటారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు.
సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వసతి దీవెన, విద్యాదీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా, మౌలిసదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకు వచ్చారు.