హైదరాబాద్, వెలుగు: నిర్మల్జిల్లాలోని నర్సాపూర్ కేజీబీవీలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వంట సమయంలో శుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం చూపిన ముగ్గురు వంట మనుషులను విధుల నుంచి జిల్లా కలెక్టర్ తొలగించారని సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్కు షోకాజ్ నోటీసులిచ్చినట్టు చెప్పారు. జిల్లా జెండర్ కోఆర్డినేటర్గా ఉన్న జి. శ్రీదేవిని ఆమె సొంత డిపార్ట్మెంట్కు పంపించినట్టు తెలిపారు. ఆమె స్థానంలో సలోమీ కరుణను ఇన్చార్జ్గా నియమించినట్టు పేర్కొన్నారు.
