దర్బార్​ రెస్టారెంట్​లో  కుళ్లిన చికెన్, పాచిపోయిన చేపలు

దర్బార్​ రెస్టారెంట్​లో  కుళ్లిన చికెన్, పాచిపోయిన చేపలు

మేడిపల్లి, వెలుగు: గ్రేటర్​పరిధిలో ఫుడ్​సేఫ్టీ అధికారుల ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్​దేవేందర్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ పై రైడ్ చేశారు.

రెస్టారెంట్​ఫ్రిడ్జ్​లో కుళ్లిన చికెన్, పాచిపోయిన చేపలు, ఇతర మాంస పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటిని ల్యాబ్ కు పంపించారు. రెస్టారెంట్​కు నోటీసులు జారీ చేసినట్లు ఫుడ్​సేఫ్టీ అధికారులు తెలిపారు.