టెన్త్ క్వశ్చన్ పేపర్లు లీక్.. ఎగ్జామ్ టైంలో తెలుగు, హిందీ పేపర్లు సోషల్ మీడియాలో చక్కర్లు

టెన్త్ క్వశ్చన్ పేపర్లు లీక్.. ఎగ్జామ్ టైంలో తెలుగు, హిందీ పేపర్లు సోషల్ మీడియాలో చక్కర్లు
  • తొమ్మిది మంది సస్పెన్షన్​​
  • నిజామాబాద్​ జిల్లా ఆలూర్​, మెండోరాలో ఘటన

నిజామాబాద్, వెలుగు: టెన్త్ పరీక్ష సమయంలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు సెల్‌‌ఫోన్ ద్వారా బయటకు వెళ్లిన ఘటనపై నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో తొమ్మిది మంది టీచర్లను సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. ఆలూర్ మండలంలోని జడ్పీ హైస్కూల్‌‌లో బుధవారం పరీక్ష జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్‌‌గా ఉన్న ఎన్.సాగర్, క్లర్క్‌‌గా విధులు నిర్వహించిన ఉమేందర్ రూల్స్​కు విరుద్ధంగా సెల్‌‌ఫోన్‌‌ను ఎగ్జామ్​ సెంటర్​లోకి తీసుకెళ్లారు.

పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి దగ్గర నుంచి తెలుగు ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న ఉమేందర్ దానిని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపాడు. తన బంధువుల పిల్లవాడి కోసం పంపిన ఈ క్వశ్చన్​ పేపర్ తర్వాత వైరల్ అయింది. ఈ విషయం పోలీసులకు చేరడంతో డీఈవో అశోక్‌‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆలూర్ చేరుకుని విచారణ జరిపిన డీఈవో, కలెక్టర్‌‌కు నివేదిక అందించారు. దీంతో సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ రాజేందర్, డిపార్ట్​మెంటల్​ ఆఫీసర్ విజయ్‌‌కుమార్, ఇన్విజిలేటర్ ఎన్.సాగర్, క్లర్క్ ఉమేందర్‌‌ ను సస్పెండ్ చేశారు.

మెండోరా స్కూల్లో హిందీ పేపర్​..

ఇక మెండోరా జడ్పీ హైస్కూల్‌‌లో జరిగిన మరో ఘటనలో హిందీ ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి పంపిన ఘటనలో ఎస్జీటీ భూపతి, జీహెచ్​ఎం మమత, ఎస్​ఏలు రవీందర్​, వేణు, ఆశీర్వాదంను కూడా సస్పెండ్ చేశారు. భూపతి ఫొటో తీసిన పేపర్ ను పొరపాటున వాట్సాప్ స్టేటస్‌‌లో పెట్టడంతో వైరల్ అయింది. పర్యవేక్షణ లోపాలపై సంబంధిత ఇన్విజిలేటర్లు, అధికారులపై మరిన్ని చర్యలు తీసుకోవాలని డీఈవో సిఫారసుచేశారు.