
బొప్పాయిలో పాపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పొట్టలోని పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది, అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది. దాంతో పాటు కడుపుని చల్లబరచడంతో పాటు, మలబద్ధకం, పైల్స్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే బొప్పాయి తిన్న తర్వాత తప్పక నివారించాల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
బొప్పాయి తిన్న తర్వాత ఏం తినకూడదు:
1. బొప్పాయి తిన్న తర్వాత పాలు తాగొచ్చా..?
బొప్పాయి తిన్న తర్వాత పాలు తాగడం మానుకోవాలి. ఎందుకంటే బొప్పాయి, పాలు రెండూ కలిసి మిమ్మల్ని మలబద్ధకం లేదా కడుపు నొప్పికి గురి చేస్తాయి. ఇది ఆకస్మిక అజీర్ణం, ఉబ్బరం, విరేచనాలకు కారణమవుతుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత పాలు తాగడం మానేయాలి.
2. బొప్పాయి తిన్న తర్వాత టీ తాగాలా?
బొప్పాయి తిన్న తర్వాత టీ తాగడం వల్ల పాపైన్ ఎంజైమ్తో చర్య జరుపుతుంది. ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. దీంతో పాటు, టీ ఆకులలో కాటెచిన్లు ఉంటాయి. ఇవి పాపైన్ సమ్మేళనంతో కలిసి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.
3. బొప్పాయి తర్వాత గుడ్డు తినొచ్చా?
బొప్పాయి తిన్న తర్వాత కోడిగుడ్లు తినడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. విటమిన్ సి, పాపైన్ ఎంజైమ్లు సమృద్ధిగా ఉండే ఈ బొప్పాయిలో, ప్రోటీన్స్, ఒమేగా-3లో కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండింటినీ ఒకేసారి తినడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడుతుంది. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు అనారోగ్యానికి గురి చేస్తుంది. అజీర్ణం, వికారం, మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది.
4. బొప్పాయి తిన్న తర్వాత పెరుగు తినాలా?
బొప్పాయి తిన్న తర్వాత పెరుగు తినడం వల్ల శారీరకంగా హాని కలుగుతుంది. కానీ ఆయుర్వేద దృక్కోణంలో, బొప్పాయి వేడిగా ఉంటుంది, పెరుగు చాలా చల్లగా ఉంటుంది. అందుకే వీటిని కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
5. బొప్పాయి తిన్న తర్వాత నిమ్మకాయ తినొచ్చా?
బొప్పాయి, నిమ్మకాయలు కలిసి మీ శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని కలిగించే విష సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. ఈ లోపం రక్తహీనత రూపంలో ఉండవచ్చు. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు అనారోగ్యానికి గురి చేస్తుంది. కాబట్టి, బొప్పాయి తిన్న తర్వాత వీటిని తినకుండా ఉండండి.