సిగ్నల్స్ వద్ద వేధిస్తున్నారంటూ పోలీసులకు పెరుగుతున్న ఫిర్యాదులు
గుర్తించి షెల్టర్ హోమ్స్ కు తరలిస్తున్న పోలీస్, బల్దియా సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: సిటీ రోడ్లపై పైసల కోసం భిక్షగాళ్లు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. రెడ్సిగ్నల్పడగానే జంక్షన్లలో కాచుకొని ఉంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వరుస ఫోన్లు, ట్విట్టర్లో కంప్లైంట్స్వస్తున్నాయి. దీంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు స్పెషల్ఆపరేషన్చేపట్టారు. జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి సిటీలోని షెల్టర్హోమ్స్కు తరలిస్తున్నారు. ఈ విషయంపై ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ నెల 18న సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో బల్దియా అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్లు, ట్రాఫిక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిటీలో బెగ్గర్స్ వల్ల ఎదురవుతున్న సమస్యలపై చర్చించి స్పెషల్డ్రైవ్చేపట్టారు.
ట్రాఫిక్ జామ్, ప్రమాదాలు
రద్దీ ఎక్కువగా ఉండే సిగ్నల్స్ వద్ద పదుల సంఖ్యలో భిక్షగాళ్లు ఉంటున్నారు. చంటి పిల్లలను చూపిస్తూ అడుక్కుంటున్నారు. సిగ్నల్ పడగానే కార్లు, బైక్స్వద్దకు వెళ్లి పైసలు అడుగుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అవుతోంది. అబిడ్స్, ఎంజే మార్కెట్, మసాబ్ట్యాంక్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సహా ప్రధాన రూట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా బెగ్గర్స్కదలికలు తెలుసుకున్నారు. ఇలా సిటీలోని బెగ్గర్స్ను మూడు రోజులుగా తరలిస్తున్నారు. కొందరిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. అలాగే పగలు ఫుట్పాత్లపై ఉంటున్న వారిని కూడా ట్రేస్ చేస్తున్నారు. షెల్టర్ హోమ్స్లో ఉండలేని వారిని సిటీ శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారు.