
నిజామాబాద్ రూరల్, వెలుగు: నిజామాబాద్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి స్పెషల్గా రూ.26 కోట్లను ప్రభుత్వం శాంక్షన్చేసిందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం నగర శివారులోని విలీన గ్రామాలైన బోర్గాం(పి), మాధవనగర్, బ్యాంకు కాలనీ, గూపన్పల్లి, ఖానాపూర్, కాలూర్, సారంగాపూర్ గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠ ధామాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివారు గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేసిన టైంలో అనేక మంది విమర్శించారని, గ్రామాలు అభివృద్ధికి నోచుకోవని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ కు విలీన గ్రామాల సమస్యలను వివరించి స్పెషల్ఫండ్స్తీసుకొచ్చానని ఈ సందర్భంగా బాజిరెడ్డి తెలిపారు. ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, కార్పొరేటర్లు సౌజన్య, లలిత, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.