సర్పంచ్ లకు చెక్ పవర్ కూడా ఇవ్వలేదు: రాజగోపాల్ రెడ్డి

సర్పంచ్ లకు చెక్ పవర్ కూడా ఇవ్వలేదు: రాజగోపాల్ రెడ్డి

మరోసారి ప్రజా ప్రతినిధులందరు న్యాయానికి ధర్మానికి పెద్దపీట వేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పబోతున్నారు మునుగోడు ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్ లో మీడియా తో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షాలు ఉండకూడదని కాంగ్రెస్ ను TRS లో విలీనం చేస్తానని ఎప్పుడైతే అన్నారో ఆరోజు నుండే  CM KCR పతనం మొదలైందన్నారు. ఎమ్యెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మాయమాటలు చెప్పి రెండో సారి గెలిచిన కేసీఆర్ సర్పంచులకు ఈరోజు వరకు కనీసం చెక్ పవర్ ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని, ఆర్ధికంగా దివాళా తీయించి, ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టి బంగారు తెలంగాణ అనే నినాదాన్ని అప్పుల తెలంగాణ చేసిన కేసీఆర్…తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చారన్నారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.