
- కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో హై ఎండ్ సర్వర్ల తయారీ చేపట్టేందుకు వీవీడీఎన్ టెక్నాలజీస్ అమెరికా కంపెనీ హ్యులెట్ ప్యాకార్డ్ ఎంటర్ప్రైజ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐటీ, టెలికం మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాబోయే 4–5 ఏళ్లలో 1 బిలియన్ డాలర్ల విలువైన సర్వర్లు తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెక్నాలజీ డెవలప్మెంట్లో పరస్పరం సహకరించకోవాలనే అమెరికా–ఇండియా అంగీకరించిన 10 రోజులలోపే ఈ ఎంఓయూ కుదిరింది.
ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐ స్కీము కింద తాజా ఒప్పందం జరిగింది. ఈ స్కీమును ఇటీవలే ప్రధాన మంత్రి ఆమోదించారు. స్కీము కింద మొదటి ఎంఓయూను వీవీడీఎన్ టెక్నాలజీస్తో కుదుర్చుకున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రొడక్షన్ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.