జవహర్నగర్, వెలుగు: జవహర్నగర్లోని ఓ ప్రముఖ వ్యక్తి ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జవహర్నగర్ బాలాజీ నగర్లో నివాసముండే ఓ నాయకుడు, అతని సోదరుడు విదేశాలు, గోవా నుంచి మద్యం బాటిళ్లను నిబంధనలకు విరుద్ధంగా తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. సుమారు 370 విదేశీ, గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
