
హైదరాబాద్సిటీ, వెలుగు: నెహ్రూ జూ పార్కులో ఆదివారం జరిగిన వన మహోత్సవానికి స్టేట్ పీసీసీఎఫ్ డాక్టర్ సి. సువర్ణ, వైల్డ్లైఫ్ పీసీసీఎఫ్ ఎలుసింగ్ మెరు పాల్గొని ఫికస్ చెట్లు నాటారు. రెండేళ్ల వయసున్న ఆఫ్రికన్ సర్వల్ క్యాట్లను ఎన్క్లోజర్లో విడుదల చేసి ప్రదర్శనకు అందించారు. అలాగే తెలంగాణ మ్యాప్ ఆకారంలో రూపొందిన ఫాజిల్ పార్క్ గార్డెన్ను ప్రారంభించారు. జూలో సర్వల్ క్యాట్లతో సహా 195 వివిధ జాతుల జంతువులను ఎన్క్లోజర్లలో పెంచుతున్నట్లు డాక్టర్ సువర్ణ తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ ‘తమ తల్లి పేరుతో ఒక మొక్క’ నాటాలని పిలుపునిచ్చారు.