రిజర్వ్​ ఫారెస్ట్​లో చెట్ల నరికివేత

రిజర్వ్​ ఫారెస్ట్​లో చెట్ల నరికివేత
  • 8 మందిపై కేసు ఫైల్​ చేసిన ఫారెస్ట్​ ఆఫీసర్లు

మహాముత్తారం, వెలుగు : మండలంలోని పెగడపల్లి రేంజ్ పరిధిలో ఉన్న రిజర్వ్​ఫారెస్ట్​లో అక్రమంగా చొరబడిన కొందరు పెద్ద పెద్ద చెట్లని నరికివేశారు. మేడారం మెయిన్​ రోడ్డు పక్కనే జరిగిన ఈ   ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పెగడపల్లికి చెందిన కొందరు వ్యక్తులు గొత్తికోయ గిరిజనులను పిలిచి అడవిని నరికించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై రేంజ్​ ఆఫీసర్​ స్వాతిని వివరణ కోరగా..  అడవిలో చెట్లు నరికిన 8 మందిని గుర్తించామని,   కేసు ఫైల్​ చేసి రిమాండ్​కు తరలించామని తెలిపారు.