ములుగు జిల్లాలో అడవిలో అక్రమంగా నివసించొద్దు : డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అశోక్

ములుగు జిల్లాలో అడవిలో అక్రమంగా నివసించొద్దు : డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అశోక్

మంగపేట, వెలుగు : పచ్చని అడవి జీవవైవిధ్యం కలిగినదని, అడవి కేవలం జంతువులకు పక్షులకు నివాసం మాత్రమేనని, ఇతరులెవరూ అడవిలో అక్రమంగా నివాసం ఉండకూడదని డిప్యూటీ రేంజ్​ ఆఫీసర్​ అశోక్​తెలిపారు. శనివారం ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసాగర్​ అటవీ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఎనిమిది కుటుంబాలకు కౌన్సిలింగ్​ ఇచ్చి ఛత్తీస్​గడ్​కు పంపించారు. 

వీరు నెల రోజుల కింద కూడా నరసింహసాగర్ అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకోవడానికి వెంకటాపురం సమీపంలోని చాకిరేవు గుత్తికోయ గుంపు నుంచి అవసరమైన వస్తువులతో రావడంతో ఫారెస్ట్ సిబ్బంది గమనించినట్లు అశోక్​పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్​ఎస్​వో హనుమా, ఎఫ్బీవోలు పుణ్యలత, లక్ష్మీదేవి, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.