బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు

బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు

మాదాపూర్, వెలుగు: సంస్థలో తోటి పార్టనర్​వాటాను తమ పేరుకి బదిలీ చేయాలని ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగడమే కాకుండా సంతకాలు ఫోర్జరీ చేసిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పురుషోత్తం నాయుడిపై మాదాపూర్​పోలీస్​స్టేషన్​లో ఫోర్జరీ కేసు నమోదైంది. గత నెల 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కృష్ణమోహన్​వివరాల ప్రకారం.. మాదాపూర్​లో నివాసం ఉండే రాజశేఖర్​రావు, పరకాల బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పురుషోత్తంనాయుడు ముగ్గురు కలిసి విజన్​రిసార్ట్స్​పేరుతో రియల్​సంస్థ నిర్వహిస్తున్నారు. 

కంపెనీలో పురుషోత్తం, ధర్మారెడ్డి, రాజశేఖర్​రావుకు 60 శాతం, మరో ఆరుగురికి 40 శాతం వాటా ఉంది. అయితే, సంస్థ డెవలప్మెంట్​విషయంలో ధర్మారెడ్డి, పురుషోత్తంతో రాజశేఖర్​రావు​కు గొడవ జరిగింది. దీంతో వీరిద్దరూ మాదాపూర్​లోని రాజశేఖర్​రావు ఇంటికి వెళ్లి కంపెనీలో తన వాటాను ఇచ్చేసి తప్పుకోవాలని బెదింరించారు. ఆయన నిరాకరించడరంతో సంతకాన్ని మరో వ్యక్తితో ఫోర్జరీ చేయించి నాంపల్లిలో రిజిస్ట్రేషన్​ కోసం అప్లై చేశారు. ఈ క్రమంలో ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి, తన సంతకం ఫోర్జరీ చేసినట్లు రాజశేఖర్​రావు సెప్టెంబర్​28న మాదాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పురుషోత్తం నాయుడుతోపాటు ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.