మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి..

మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి..
  • మున్సిపల్ చైర్మన్ భర్త పేరిట అక్రమ రిజిస్ట్రేషన్కు యత్నం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి

సూర్యాపేట జిల్లా : తన సంతకాన్ని  మున్సిపల్ చైర్ పర్సన్ భర్త గేల్లి రవి ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు  హుజుర్  నగర్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. గురువారం ఇందుకు సంబంధించిన పత్రాలైన  భూ రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీ పత్రాలతో  పోలీసులను ఆశ్రయించినట్లు శ్రీనివాస్ రెడ్డి మీడియాకు చెప్పారు .మున్సిపల్ చైర్ పర్సన్ భర్త గెల్లి రవి అధికారుల లాగ్ఇన్ ఐడి, పాస్వర్డ్ దొంగిలించి ఫోర్జరీ పత్రాలను సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు.   పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని నల్గొండ ఎంపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు లేఖ రాశానని చెప్పారు. అక్రమాలకు పాల్పడ్డవారిపై  చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యలో మున్సిపాలిటీ ఆఫీస్ ముందు  కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు  ఆందోళన చేశారు. వెంటనే స్పందిచిన  అధికారులు మున్సిపల్ చైర్ పర్సన్ గేల్లీ అర్చన చాంబర్ కు తాళం వేసి, సీసీ కెమెరాలు అమర్చారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.