విశాఖ నుంచే మళ్లీ ఎంపీగా పోటీ చేస్తా : జేడీ లక్ష్మీనారాయణ

విశాఖ నుంచే మళ్లీ ఎంపీగా పోటీ చేస్తా : జేడీ లక్ష్మీనారాయణ

2024 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రజలు తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఇచ్చారని అందుకే మళ్లీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలనుకుంటున్నట్లు చెప్పారు. అప్పటి వరకు తన భావజాలానికి అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీకి మద్దతుగా ఇస్తానని తెలిపారు. త్వరలో తన మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు.  

గత ఎన్నికల్లో జనసేన తరుపున విశాఖ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన లక్ష్మీనారాయణ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన జనసేనకు రాజీనామా చేశారు.  గతంలో సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.  ఆ తరువాత పాలిటిక్స్ లోకి వచ్చారు.