రెండుసార్లు ప్రయాణం క్యాన్సిల్.. మూడోసారి మృత్యువు ఒడిలోకి.. విజయ్ రూపానీని వెంటాడిన విధి

రెండుసార్లు ప్రయాణం క్యాన్సిల్.. మూడోసారి మృత్యువు ఒడిలోకి..  విజయ్ రూపానీని వెంటాడిన విధి

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, జూన్ 12న లండన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలన్నది ఆయన ఫస్ట్ చాయిస్ కాదని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. విజయ్ రూపానీ లండన్‌‌‌‌‌‌‌‌లోని తన భార్య అంజలి, కుమార్తెను కలవడానికి మొదట మే 19న ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ171లో టికెట్ బుక్ చేసుకున్నారు. జూన్ 25న భారత్‌‌‌‌‌‌‌‌కు తిరిగి రావాలని ప్లాన్ చేశారు. లుధియానా వెస్ట్ ఉప ఎన్నికల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. 

జూన్ 5న మరోసారి టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. బీజేపీ పంజాబ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఛార్జ్‌‌‌‌‌‌‌‌గా ఉప ఎన్నికల సన్నాహాల కోసం లుధియానాలో ఉండాల్సి రావడంతో మళ్లీ రద్దు చేసుకున్నారు. చివరకు జూన్ 12న ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ171లో బిజినెస్ క్లాస్‌‌‌‌‌‌‌‌లో సీటు నంబర్ 2డీ బుక్ చేసుకున్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. దాంతో విమానంలోని వారందరితోపాటు విజయ్ రూపానీ కూడా చనిపోయారు.