అర్బన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్ కెప్టెన్‌‌గా రైనా

అర్బన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్ కెప్టెన్‌‌గా రైనా

హైదరాబాద్‌‌, వెలుగు: లెజెండ్స్‌‌ లీగ్ క్రికెట్ (ఎల్‌‌ఎల్‌‌సీ) రెండో సీజన్‌‌లో అర్బన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్ టీమ్ బరిలో నిలిచింది. హైదరాబాద్‌‌కు చెందిన అర్బన్‌‌రైజ్, ట్రైడెంట్‌‌ పవర్‌‌ సంస్థలు కొనుగోలు చేసిన టీమ్‌‌కు టీమిండియా మాజీ ఆల్‌‌రౌండర్‌‌‌‌ సురేశ్​ రైనా కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు.  స్టువర్ట్ బిన్నీ, మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, పీటర్ ట్రెగో, చమార కపుగెదెరతో సిటీకి చెందిన ప్రజ్క్షాన్ ఓఝా, తిరుమలశెట్టి సుమన్‌‌, సుదీప్‌‌ త్యాగితో కూడిన టీమ్‌‌కు నిఖిల్ చోప్రా కోచ్‌‌గా పని చేస్తున్నాడని ఆర్గనైజర్స్ తెలిపారు.  

టీమ్ జెర్సీని శనివారం టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్, ఓఝా, గప్టిల్‌‌  విడుదల చేశారు. రాంచీలో శనివారం మొదలైన లీగ్‌‌ డెహ్రాడూన్‌‌, జమ్ము, వైజాగ్, సూరత్ నగరాల్లో జరగనుంది. ఈ నెల 21న హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌‌ను సదర్న్‌‌ సూపర్‌‌‌‌ స్టార్స్‌‌తో రాంచీలో ఆడనుంది.