కరోనా నుండి ప్రజలను కాపాడిన ఘనత మోడీదే

కరోనా నుండి ప్రజలను కాపాడిన ఘనత మోడీదే
  • బహిరంగసభను విజయవంతం చేయాలి
  • కరోనా నుండి ప్రజలను కాపాడిన ఘనత మోడీదే

మహబూబాబాద్ జిల్లా: లాక్ డౌన్ సమయంలో దేశంలో ని ప్రజలందరికి  వ్యాక్సిన్ ఇచ్చి, కరోనా నుండి ప్రజలను కాపాడిన ఘనత మోడీ ప్రభుత్వానిది అన్నారు జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ మాజీ సిఎం బాబులాల్ మారండి. శుక్రవారం ఆయన మహబూబాబాద్ లో పర్యటించి మాట్లాడారు. "2014కు ముందు పేద ప్రజలకు కనీసం బ్యాంక్ ఖాతాలు లేవు. కరోన కష్ట కాలంలో పేద ప్రజల జన్ ధన్ ఖాతాలో డైరెక్ట్ గా డబ్బులు జమ చేశాం. ప్రధానమంత్రి అవాస్ యోజన కింది పేద ప్రజలకు ఇండ్లు కట్టించాం. ఆయుష్మాన్ భారత్ తో పేద ప్రజలకు  ఆరోగ్య భీమాను అందిస్తున్నాం. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ సిపర్సులను అమలు చేస్తూ.. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశాం. డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్టం అభివృద్ధి చెందుతుంది. ఈ నెల 3 న హైద్రాబాద్ లో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలి." అని పిలుపునిచ్చారు  బాబులాల్.