టీడీపీకి ఝలక్.. బీజేపీలో చేరిన మాజీమంత్రి

టీడీపీకి ఝలక్.. బీజేపీలో చేరిన మాజీమంత్రి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ నుంచి పలువురు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడారు. లేటెస్ట్ గా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. ఇవాళ ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో  ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆదినారాయణరెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.అప్పటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్న ఆయన ఇవాళ బీజేపీలో చేరారు.