తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది : ఈటల 

తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది : ఈటల 

ఢిల్లీ :  బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై సీరియస్ గా ఫోకస్ చేసిందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అమిత్ షా కార్యాచరణ రూపొందించారని, దాన్ని తనకు వివరించారని చెప్పారు. అమిత్ షా పిలుపు మేరకు తాను ఢిల్లీ వచ్చానని, ఆయనతో దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యానని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకువచ్చే కార్యాచరణపై చర్చించామన్నారు.