డీ.శ్రీనివాస్కు మరోసారి అస్వస్థత..ఆస్పత్రిలో చికిత్స

డీ.శ్రీనివాస్కు మరోసారి అస్వస్థత..ఆస్పత్రిలో చికిత్స

సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం (సెప్టెంబర్ 11న) మధ్యాహ్నం హాస్పిటల్ లో అడ్మిట్ చేశామని ఆయన కుమారుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం ఐసీయూలో డీఎస్ చికిత్స తీసుకుంటున్నారు. డీఎస్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. డీఎస్ ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. 

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలోనే డీఎస్‌కు బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) రావడంతో పక్షవాతం కూడా సోకింది. మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా ఇదే సిటీ న్యూరో సెంటర్‌కు తరలించిన కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత డీఎస్ కోలుకున్నారు. అయితే అంతా బాగుందనుకున్న టైమ్‌లో ఇప్పుడు సడెన్‌గా ఇలా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.