సుప్రీం కోర్టులో మాజీ మంత్రి నారాయణకు చుక్కెదురు

సుప్రీం కోర్టులో మాజీ మంత్రి నారాయణకు చుక్కెదురు

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో టీటీడీ నేత, మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నారాయణ దాఖలు చేసిన పిటిషన్‭ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజ్ కేసులో నారాయణ సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం.. సెషన్స్ కోర్టులో విచారణ చేపట్టాలని ఆదేశించింది. మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని చెప్పింది. ఇక సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై వారంలో హైకోర్టుకు వెళ్లవచ్చని సుప్రీం స్పష్టం చేసింది. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశించింది. ఇక నారాయణ ఎడ్యుకేషనల్ సంస్థకు 2014లోనే తాను రాజీనామా చేసినట్లు.. నారాయణ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.