
- కల్తీ సాకుతో కల్లు దుకాణాలు మూయడం సరికాదు
- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బషీర్బాగ్,వెలుగు: కల్తీ సాకుతో కల్లు దుకణాలను పర్మినెంట్గా మూసేయడం సరికాదని, వెంటనే ఆ షాపులను తెరవాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. శుక్రవారం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం ఎదుట తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, కల్లుగీత వృత్తిదారుల సంఘం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. బార్, వైన్ షాపుల్లో కల్లు గీత సొసైటీ సభ్యులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో బాలరాజ్ గౌడ్ , అయిలి వెంకన్న గౌడ్ , దామోదర్ గౌడ్, దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బైరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.