హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలు అమలు చేయడం సాధ్యం కాదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అనడం సరికాదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కేవలం రెండు నెలల్లోనే 20 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసిన విషయం కిషన్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘మేడారం జాతరకు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తరలివెళ్తున్నారు. కిషన్ రెడ్డికి ఇది కనిపిస్త లేదా? నిజమేంటో తెలుసుకుని మాట్లాడాలి. అవగాహన లేకుండా మాట్లాడుతున్నవ్.. నువ్వేం కేంద్ర మంత్రివి? నువ్వు అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడివేనా? కిషన్ రెడ్డి.. నీకో సవాల్ విసురుతున్న.. నువ్వు, నేను ఆర్టీసీ బస్సు ఎక్కుదాం రా.. వచ్చే దమ్ముందా?’’అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.