కాంగ్రెస్ చార్జిషీట్​లో చార్జీ లేదు.. షీటు లేదు: మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

కాంగ్రెస్ చార్జిషీట్​లో చార్జీ లేదు.. షీటు లేదు: మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రిలీజ్ చేసిన చార్జిషీట్ లో చార్జీ లేదు, షీట్ లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ఎద్దేవా చేశారు. తమది ఆర్ఎస్ఎస్ భావజాలమని గర్వంగా చెప్పుకుంటామని, అసలు కాంగ్రెస్ ది ఏ భావజాలమో చెప్పాలని ప్రశ్నించారు. దేశద్రోహం, నక్సల్స్ కి సపోర్ట్ చేయడమా అంటూ విమర్శించారు.

తామే రిజర్వేషన్లు పెంచామే తప్ప తీయలేదన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రకాశ్ రెడ్డి, ఎన్వీ సుభాశ్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ దేశ ద్రోహులకు ఏజెంట్ అని, ఆ పార్టీ దేశ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని ఆరోపించారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను హరించారని మండిపడ్డారు. తెలంగాణను ముందే ఇచ్చి ఉంటే అనేక మంది బలిదానాలు చేసుకునేవారు కాదని చెప్పారు.