- మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్
పాపన్నపేట, వెలుగు: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌజ్ ఘటనపై 307 కేసు నమోదు చేయాలని, స్టేషన్ బెయిల్ ఇచ్చిన వారందరనీ అరెస్ట్ చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్లో జరిగిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్లో పాల్గొని మాట్లాడారు.
ఫామ్హౌజ్లో డ్రగ్స్ దొరికడం, ఫైరింగ్ జరిగిన ఘటనపై తాను స్పందించానని గుర్తు చేశారు. ‘మీ ప్రభుత్వం, మీ పోలీసులు 307 కేసు పెట్టకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు.’ అని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ను ఉద్దేశించి అన్నారు.
బీజేపీ ఎక్కడ, ఏ పార్టీ వారు తప్పు చేసినా వారికి వ్యతిరేకంగా గళం విప్పుతుందని తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పెద్దలకు ఉంటే, స్టేషన్ బెయిల్ ఇచ్చిన వారందరినీ రిమాండ్ చేయాలన్నారు.
రివాల్వర్ వాడిన వారిపై కేసు పెట్టాలని, తప్పించిన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని, ఫామ్హౌజ్లోని సీసీ పుటేజీని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, సత్యనారాయణ, నందారెడ్డి, సుభాష్ చంద్రగౌడ్ పాల్గొన్నారు.
