- మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్..
ముషీరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుందని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ముషీరాబాద్ అడిగ్మెట్లో కాంగ్రెస్ నేత కరణం సురేశ్ నేతృత్వంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్లో ఇతర పార్టీలకు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ (టిల్లు), నాయకులు సందీప్, కవిత, విజయ్ యాదవ్, నరేందర్, సోహెల్, కిరణ్, వల్లభ రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.
