కేసీఆర్ మౌనానికి కమీషన్లే కారణం

 కేసీఆర్ మౌనానికి కమీషన్లే కారణం

కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ మౌనంగా ఉండడానికి కమీషన్లే కారణమన్నారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా - పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో ఏపీ సీఎం జగన్ ను ఇంటికి పిలుపించుకొని చర్చించిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు వివేక్. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి పంపకాలు జరగాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభపడింది  కాంట్రాక్టర్లు మాత్రమేనని చెప్పారు.