ఒడిశా మాజీ సీఎంకు అస్వస్థత

ఒడిశా మాజీ సీఎంకు అస్వస్థత

భువనేశ్వర్: ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గోమాంగో అస్వస్థతకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమించడంతో భువనేశ్వర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స కొనసాగుతోంది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన కొద్ది రోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఆరోగ్యం భేషుగ్గా ఉందని అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఇప్పుడు అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆయన కుమారుడు శిశిర్‌ గొమాంగొ తెలిపారు. గిరిధర్ గోమాంగొ గతంలో ఎంపీగా ఉండిన సమయంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో కేంద్రంలో అప్పటి వాజ్ పేయి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ ప్రభుత్వం కూలిపోయింది.