
హైదరాబాద్, వెలుగు: మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రులు, ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన విమర్శలను ఖండిస్తున్నామని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. తెలంగాణలో ఇచ్చిన 2 పీఆర్సీల ఫిట్ మెంట్ 73% అయితే.. ఏపీలో 66% మాత్రమేనని దేవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో అన్ని సమస్యలు పరిష్కారమైతే టీచర్లు, ఉద్యోగులు నిరంతరం ఎందుకు నిరసనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, అమర్ నాథ్ ఇటీవల చేసిన కామెంట్లు విడ్డూరంగా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్-తో హరీశ్ రావు సమస్యలు ఎదుర్కొంటున్నారని.. అందుకే ఏపీ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారని అనడం వాళ్ల మూర్ఖత్వమని పేర్కొన్నారు.
మంత్రి హరీశ్పై ఏపీ ఉద్యోగ నేతల విమర్శలు సరికావని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ మామిల్ల రాజేందర్, జనరల్ సెక్రటరీ రాయకంటి ప్రతాప్, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ కస్తూరి అన్నారు.