వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్..

వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్..

వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది..గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసు సహా పలు కేసుల్లో అరెస్టైన వల్లభనేని వంశీకి మంగళవారం ( జులై 1 ) బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. దీంతో అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ వచ్చినట్లయ్యింది. ప్రస్తుతం కృష్ణా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశి రేపు ( జులై 2 ) విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2025 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు.

గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసు నమోదు చేశారు. కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేసి అక్కడే ఉన్న కొందరు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టినట్టుగా వంశీ అనుచరులపై కేసు నమోదైంది. వంశీ అనుచరులు గానీ, వైసీపీ కార్యకర్తలు గానీ.. మొత్తం మీద 71 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ | ఈసారి కూడా పాదయాత్ర చేస్తా: జగన్ సంచలన నిర్ణయం

అయితే.. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీకి ఇప్పటికే బెయిల్ మంజూరు అయినప్పటికీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి రిమాండ్ విధించింది కోర్టు. జైలులో శ్వాస కోస సమస్యతో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు వంశి. పలు ఆసుపత్రిలో కూడా అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకున్నారు వంశి. ఎట్టకేలకు మంగళవారం ( జులై 1 ) నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ వచ్చినట్లయ్యింది.