విలేజ్ కోర్టులు ఏర్పాటు చేయండి

విలేజ్ కోర్టులు ఏర్పాటు చేయండి

దరాబాద్, వెలుగు: గ్రామాల్లో విలేజ్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి సూచించారు. శనివారం ఈ అంశంపై హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ కు ఆయన లేఖ రాశారు. రాష్ర్ట వ్యాప్తంగా 55 విలేజ్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం  2019 ఫిబ్రవరిలో అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు.

 దీనిపై హైకోర్టుకు ప్రభుత్వం పంపిన ఫైల్ ను ఆమోదించాలని తన లేఖలో పేర్కొన్నారు. చిన్న చిన్న కేసులకు కూడా జిల్లా, హైకోర్టులకు రావటం పబ్లిక్ కు ఇబ్బందిగా మారిందని తెలిపారు.  లా కమిషన్ సిఫార్సుల ప్రకారం 2008లో విలేజ్ కోర్టుల ఏర్పాటుపై కేంద్రం చట్టం తీసుకొచ్చిందని  వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడే విలేజ్ కోర్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ ను పద్మనాభ రెడ్డి కోరారు.