నవంబర్ 3న జూబ్లీహిల్స్ అభ్యర్థులతో ముఖాముఖి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్

నవంబర్ 3న జూబ్లీహిల్స్ అభ్యర్థులతో ముఖాముఖి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్
  • ప్రశ్నలు అడిగేందుకు 50 మంది ఓటర్లకు చాన్స్ 
  • ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ ప‌ద్మనాభ‌రెడ్డి ప్రకటన

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్​జీజీ) కీలక ప్రకటన చేసింది. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో నిలిచిన అభ్యర్థులతో వచ్చే నెల 3న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు హాజరుకానున్నట్లు ఎఫ్​జీజీ ప్రెసిడెంట్ ప‌ద్మనాభ‌రెడ్డి తెలిపారు. ముఖాముఖిలో నియోజకవర్గం నుంచి     50 మంది ఓటర్లు పాల్గొని, ప్రశ్నలను అడగనున్నారని వివరించారు.  ‘

‘అసలు మీకు ఓటు ఎందుకు వేయాలి? వేస్తే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఎలా?’’ వంటి ప్రశ్నలకు అభ్యర్థులు జవాబులు ఇవ్వనున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎఫ్​జీజీ గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఓటర్ అవేర్‌నెస్  ప్రోగ్రామ్ నిర్వహించింది.  

ఈ సంద‌ర్భంగా ప‌ద్మనాభ‌రెడ్డి మాట్లాడుతూ..‘‘జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ శాతం పెంచడానికి, ఓటర్లు ప్రలోభాల‌కు లొంగ‌కుండా అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించాం. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటాకైనా ఓటు వేయాలి. ఓటింగ్ లో కచ్చితంగా పాల్గొనాలి’’ అని పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్​లు  నాగిరెడ్డి, చంద్రవ‌ద‌న్, ఎంవీ రెడ్డి,  ఎఫ్​జీజీ వైస్ ప్రెసిడెంట్ గోపాల్‌రెడ్డి, కార్యద‌ర్శి సోమ శ్రీ‌నివాస్ రెడ్డి, వివేక్,  భాస్కర రెడ్డి, సి. విజ‌య‌కుమార్ రెడ్డి,  జి.శ్యామ్ ప్రసాద్ త‌దిత‌రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.