హైదరాబాద్, వెలుగు: ఈ నెల 8వ తేదీన ఫలక్నుమాలో ఓల్డ్ సిటీ మెట్రో లైన్ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 4 స్టేషన్లు నిర్మించనున్నారు. 5.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణానికి రూ. 2000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఎంజీబీఎస్ నుంచి దారుల్ షిఫా జంక్షన్, పురానీహవేలీ, ఇత్తేబాద్ చౌక్, అలీజాకోట్ల, మీర్మోమిన్దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ప్రాంతాల మీదుగా ఫలక్ నుమా వరకు అలైన్మెంట్ఉంటుంది.
సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా ఏరియాల్లో స్టేషన్లు నిర్మించనున్నారు. నిర్మాణంలో 1,100 ప్రాపర్టీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మతపరమైన, చారిత్రక కట్టడాలు డ్యామేజ్కాకుండా చూసేందుకు అధికారులు రోడ్డు విస్తరణను 100 ఫీట్లకే పరిమితం చేశారు. స్టేషన్ల వద్ద రోడ్డును 120 ఫీట్లకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ లైన్అందుబాటులోకి వస్తే చార్మినార్, సాలర్ జంగ్మ్యూజియం వంటి చారిత్రక కట్టడాలను మెట్రోలో వెళ్లి చూసి రావచ్చు.