
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట సమీపంలోని ఫారెస్ట్ ఏరియాలో ఇటీవల ఆవుపై పులి దాడి చేసిన విషయం తెలిసిందే. పులిని చంపేందుకు నలుగురు వ్యక్తులు చనిపోయిన ఆవుపై విష పదార్థాలు చల్లినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
స్కూల్ తండాకు చెందిన బిక్యా మహిపాల్, గంగావత్ కన్నీరాం, సలావత్ సంజీవ్, గోపాల్లను అరెస్ట్చేసి మంగళవారం రిమాండ్కు తరలించినట్లు ఎఫ్వో నిఖిత, మాచారెడ్డి ఎఫ్ఆర్వో దివ్య తెలిపారు. పులి జాడ కోసం రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లోని ఫారెస్ట్ ఏరియాల్లో అధికారులు, సిబ్బంది విస్తృతంగా గాలించారు. ట్రాక్ కెమెరాలు, డోన్ కెమెరాలతో అన్వేషిస్తున్నారు.