కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఏనుమాముల అగ్రికల్చర్ మార్కెట్ నాలుగు రోజుల పాటు బంద్ ఉంటుందని సెక్రటరీ మల్లేశం తెలిపారు. శనివారం వారంతపు సెలవు, ఆదివారం మహా శివరాత్రి, సోమవారం శివరాత్రి జాగారాం కాగా మంగళవారం అమావాస్య ఉండడంతో మార్కెట్ సెలవు ప్రకటించినట్లు చెప్పారు. రైతులెవరూ తమ పంట ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురావద్దని సూచించారు. మార్కెట్ తిరిగి బుధవారం ప్రారంభం అవుతుందని తెలిపారు.
