
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంబలపూలకుంట సమీపంలోని పవర్ ప్లాంట్ వద్ద హంద్రీనీవా కాలువలో ట్రాక్టర్ బోల్తాపడటంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.