బర్త్ డే వేడుకల్లో విషాదం..ఈతకు వెళ్లిన నలుగురు యువకులు మృతి

బర్త్ డే వేడుకల్లో విషాదం..ఈతకు వెళ్లిన నలుగురు యువకులు మృతి

ములుగు జిల్లా రంగరాయపురంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురి మృతదేహాలు గుర్తించారు. నిన్న ఇద్దరు,ఇవాళ మరో ఇద్దరి  మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి ముందు నిన్న స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. నిన్నటి నుంచి గల్లంతైన వారి కోసం రాత్రంతా గాలించి ఇద్దరి మృతదేహాలను వేలికి తీయగా..ఇవాళ మరో ఇద్దరిని వెలికితీశారు.  మృతి చెందిన వారు శ్రీకాంత్, తుమ్మ కార్తీక్, అన్వేష్, ప్రకాష్‌లుగా గుర్తించారు.వీరంత వెంకటాపురం మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గోదావరి తీరం కుటుంభ సభ్యుల ఆర్తనాదాలతో నిండిపోయింది.