హైదరాబాద్లో ఎఫ్‌‌‌‌పీఓ కాన్‌‌‌‌క్లేవ్‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్లో ఎఫ్‌‌‌‌పీఓ కాన్‌‌‌‌క్లేవ్‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: సమున్నతి,  నాబార్డ్ భాగస్వామ్యంతో హైదరాబాద్​లో బుధవారం ఐదో ఫార్మర్ ​ప్రొడ్యూసర్స్​ ఆర్గనైజేషన్స్​(ఎఫ్‌‌‌‌పీఓ) కాన్‌‌‌‌క్లేవ్‌‌‌‌ మొదలయింది.  ఈ సదస్సు ద్వారా విధాన రూపకర్తలు, పరిశ్రమల నాయకులు, రైతు సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి.  కేంద్ర వ్యవసాయ,  రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మహిళల పాత్రను కొర్టెవా అగ్రిసైన్స్​ ప్రెసిడెంట్ సుబ్రతో వివరించారు.

 ఈ కార్యక్రమంలో 'స్టేట్​ ఆఫ్​ ది​ సెక్టార్​ రిపోర్ట్​ 2025' 5వ ఎడిషన్​ను విడుదల చేశారు. సమున్నతి  సీఈఓ అనిల్ కుమార్ ఎస్​జీ మాట్లాడుతూ, మార్కెట్లు చిన్న రైతులకు నిజంగా ఉపయోగపడేలా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. నేటి ప్రపంచంలో రైతులు ప్రపంచానికి పరిష్కారాలను అందించగలరని ఆయన తెలిపారు. ఎఫ్‌‌‌‌పీఓలను పెట్టుబడికి సిద్ధంగా, ప్రపంచంతో అనుసంధానించే విధంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.