
కరీంనగర్ టౌన్, వెలుగు: మహిళలు స్వీయ పరీక్ష ద్వారా రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించవచ్చని, తద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సనా చారిటబుల్ ట్రస్ట్, ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గురువారం పోలీస్, మున్సిపల్ మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించారు.
కలెక్టర్ తోపాటు సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, మహిళలు తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సనా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సురభి సత్తయ్య, కోఆర్డినేటర్ సురభి నరసమ్మ, ఎంఎన్ జే డాకర్లు ప్రణయ్, సుస్మితరెడ్డి పాల్గొన్నారు.