ఆపదలో అన్నం పెడుతున్రు

ఆపదలో అన్నం పెడుతున్రు

నకిరేకల్/నల్గొండ టౌన్/భువనగిరి/హాలియా, వెలుగు : లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వలస కూలీలకు ఆదివారం పలు సంఘాలు, పార్టీల పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని లక్ష్మీ నారాయణస్వామి దేవాలయ సభ్యులు గుడిపాటి శ్రీమన్నారాయణ, హైదరాబాద్ కు చెందిన జాల సోమనాథశర్మ, రేణుక, ఓరుగంటి హరిబాబు ఆధ్వర్యంలో అందజేసిన టిఫిన్ ప్యాకెట్లను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పంపిణీ చేశారు. అదే విధంగా నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో, భువనగిరిలో స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

డ్యూటీలో ఉన్న పోలీసులకు..

కరోనా నేపథ్యంలో డ్యూటీ చేస్తున్న పోలీసులకు ఆదివారం పెద్దవూర పోలీస్ స్టేషన్ లో అఖిల భారత బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అదే విధంగా నకిరేకల్ లో పోలీసులు, జర్న లిస్టులకు రాపోలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.