ఫ్రెండ్​షిప్​ డే రోజున విషాదం.. బైక్ కరెంట్ పోల్ ఢీకొని స్నేహితులు మృతి

ఫ్రెండ్​షిప్​ డే రోజున విషాదం.. బైక్ కరెంట్ పోల్ ఢీకొని స్నేహితులు మృతి
  • ఫ్రెండ్​షిప్​ డే వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ఘటన
  • రెండు కుటుంబాల్లో విషాదం


పాల్వంచ, వెలుగు: కలిసి చదువుకుంటున్న ఇద్దరు ఫ్రైండ్స్​ మరణంలోనూ తోడుగా వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ ప్రైవేట్​ కాలేజీలో ఏనుగు మధుకర్ రెడ్డి( 20),  దూడల శివ (20)  డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఫ్రెండ్​షిప్​ డే వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా  నవభారత్ సమీపంలో బైక్​అదుపుతప్పి డివైడర్ కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టి ఇద్దరు స్పాట్ లోనే  చనిపోయారు. మధుకర్ రెడ్డి బీకాం చివరి సంవత్సరం చదువుతుండగా,  శివ బీజడ్​సీ చదువుతున్నాడు.  నవభారత్ గాంధీనగర్​కు చెందిన మధుకర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.మృతుడికి తల్లి రమాదేవి, అక్క ఉన్నారు.  

వరంగల్​ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేటకు చెందిన శివ పాల్వంచలోని బీసీ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు.  అతడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద విషయం తెలిసిన పట్టణ ఎస్ఐ బాణాల రాము ఘటనా స్థలానికి చేరుకొని డెడ్​బాడీలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.