దీపావళి తెల్లారి నుంచి కేసీఆర్​ సభలు

దీపావళి తెల్లారి నుంచి కేసీఆర్​ సభలు
  • రెండో విడతలో 54 సభలు
  • హుస్నాబాద్​తో మొదలు గజ్వేల్​తో ముగింపు

హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే పలు జిల్లాలను చుట్టేసి ప్రచార సభల్లో పాల్గొన్ని సీఎం కేసీఆర్.. దీపావళి తెల్లారి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచార సభలు ప్రారంభిస్తున్నారు. అక్టోబర్15న హుస్నాబాద్​తో ప్రచారం షురూ చేసిన ఆయన శుక్రవారం వరకు 30 నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆదివారం ఈ నెల 9 వరకు మరో12 సభల్లో పాల్గొంటారు. 9 వరకు నిర్వహించే ప్రచార సభల షెడ్యూల్ ఇప్పటికే ​ప్రకటించగా, ఈనెల 13 నుంచి 28 వరకు కేసీఆర్​ పాల్గొనే సభల షెడ్యూల్​ను బీఆర్ఎస్ ​పార్టీ శనివారం రిలీజ్ ​చేసింది.

రెండో విడతలో 54 సభల్లో కేసీఆర్ ​పాల్గొననున్నారు. మొత్తంగా 96 ప్రచార సభల్లో ఆయన పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. కేసీఆర్ మొదటి విడత ప్రచారం ఈనెల 9న కామారెడ్డిలో నిర్వహించే సభతో ముగియనుంది. ఆ  తర్వాత దీపావళి కోసం మూడు రోజులు ప్రచారానికి బ్రేక్​ ఇచ్చారు. ఈ నెల 12న దీపావళి తర్వాతి రోజు నుంచి కేసీఆర్ ​తిరిగి ప్రచార సభల్లో పాల్గొంటారు. 13న దమ్మపేట(అశ్వరావుపేట) లో మొదలు పెట్టి 28న గజ్వేల్​ సభతో ఆయన ఎన్నికల ప్రచారం ముగియనుంది.