న్యూఢిల్లీ: టేస్ట్ను మెరుగుపరచడానికి, సాలిడ్ ఫుడ్ తయారీకి పాలు, పాల పదార్థాలలో కలుపుతున్న ప్రోటిన్ బైండర్స్ను (ప్రోటిన్లను గట్టిగా కలిపే ఏజెంట్లను) ఇక నుంచి ఆపాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్లోని అపెండిక్స్–ఏ లో పేర్కొన్న అడిటివ్స్ను మాత్రమే పాలు, పాలు పదార్ధాలలో కలపాలని వివరించింది.
ప్రతీ డెయిరీ ప్రొడక్ట్కు యూనిక్ టేస్ట్, ఇతర క్వాలిటీస్ ఉంటాయని, ప్రోటిన్ బైండర్స్ వంటి బైండింగ్ మెటీరియల్స్ను వాడడం వలన ఇవి మెరుగవుతాయనే గ్యారెంటీ లేదని వెల్లడించింది. కొత్త ఫుడ్ ప్రొడక్ట్లను తయారు చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్లోని ప్రొటీన్లను కలిపి ఉంచడానికి ప్రొటీన్ బైండర్స్ వంటి బైండింగ్ ఏజెంట్స్ను వాడడం తప్పనిసరి.
ముఖ్యంగా సాలిడ్ లేదా సెమీ సాలిడ్ ఫుడ్ను తయారు చేయాలంటే ఇటువంటి ఏజెంట్స్ కచ్చితంగా వాడాలి. కానీ, బైండింగ్ ఏజెంట్లను వాడడం వలన ఇటువంటి ప్రొటీన్లు సరిగ్గా జీర్ణం కావడం లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. పాలలోని నేచురల్ ప్రొటీన్ల నూట్రిటివ్ వాల్యూ పడిపోతోందని తెలిపింది. పాలలో అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే మిల్క్ ప్రొటీన్లు ఈజీగా జీర్ణం అవుతాయి. కూరగాయాలు, ఆకు కూరల నుంచి వచ్చే ప్రొటీన్లలో యాంటీ నూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
కానీ, మిల్క్ ప్రొటీన్స్తో ఈ ఇబ్బంది ఉండదు. డెయిరీ ప్రొడక్ట్స్లోని నూట్రిషనల్ వాల్యూస్ పడిపోకుండా ఉండడంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫోకస్ పెట్టింది. దీంతో పాటు టీ కి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ జీ కమల వర్ధన రావు టీ బోర్డుతో కలిసి టీ ఇండస్ట్రీలోని కంపెనీలతో సమావేశమయ్యారు.