కిక్కిరిసిన మేడారం.. 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం 

కిక్కిరిసిన మేడారం.. 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం 

మేడారం మహాజాతరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మేడారం రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. భారీ ట్రాఫిక్ జాం అయ్యింది. మేడారం నుండి పస్ర వరకు 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.
 
పస్రా మీదుగా నార్లాపూర్ వరకు గంటన్నర సేపు బస్సులు, ఇతర వాహనాలు ఆగిపోయాయి. వన దేవతలను దర్శించుకున్న భక్తులు తిరుగు పయనమయ్యారు. మరోవైపు వాహనదారులను కంట్రోల్​చేయడానికి పోలీసులు ఎంత శ్రమిస్తున్నా.. పూర్తి స్థాయిలో నియంత్రణ సాధ్యం కాని పరిస్థితి నెలకొంది.